ప్రవాసీ కార్మికుల వర్క్ పర్మిట్ల ఫీజుల్లో మార్పులు..జూన్ 1 నుంచి అమలు
- May 28, 2021
మస్కట్: ఒమనైజేషన్ లో భాగంగా ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఎక్కువ ఉపాధి కల్పించే లక్ష్యంగా ఒమన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమలు చేయబోతోంది. ప్రైవేట్ రంగంలోని ప్రవాస కార్మికులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల ఫీజులను సవరణలు చేసింది. ఈ మార్పులు జూన్ 1 నుంచే అమలులోకి రానున్నాయి. వర్క్ పర్మిట్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నా ఫీజు చెల్లించని వాళ్లందరికి ఈ నిబంధన వర్తిస్తుంది. దీంతో ప్రైవేట్ రంగంలోని ఎగువ, మధ్య శ్రేణి వర్క్ ఫోర్స్ తో పాటు సాంకేతిక రంగం, ఇతర నిపుణత కలిగిన రంగాల్లోని ప్రవాసీ ఉద్యోగుల వర్క్ పర్మిట్ల ఫీజులు మారనున్నాయి. ఈ మార్పుల కారణంగా వర్క్ పర్మిట్ల సంఖ్య తగ్గి స్థానికులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







