ప్రవాసీ కార్మికుల వర్క్ పర్మిట్ల ఫీజుల్లో మార్పులు..జూన్ 1 నుంచి అమలు
- May 28, 2021మస్కట్: ఒమనైజేషన్ లో భాగంగా ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఎక్కువ ఉపాధి కల్పించే లక్ష్యంగా ఒమన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమలు చేయబోతోంది. ప్రైవేట్ రంగంలోని ప్రవాస కార్మికులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల ఫీజులను సవరణలు చేసింది. ఈ మార్పులు జూన్ 1 నుంచే అమలులోకి రానున్నాయి. వర్క్ పర్మిట్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నా ఫీజు చెల్లించని వాళ్లందరికి ఈ నిబంధన వర్తిస్తుంది. దీంతో ప్రైవేట్ రంగంలోని ఎగువ, మధ్య శ్రేణి వర్క్ ఫోర్స్ తో పాటు సాంకేతిక రంగం, ఇతర నిపుణత కలిగిన రంగాల్లోని ప్రవాసీ ఉద్యోగుల వర్క్ పర్మిట్ల ఫీజులు మారనున్నాయి. ఈ మార్పుల కారణంగా వర్క్ పర్మిట్ల సంఖ్య తగ్గి స్థానికులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..