దృష్టి మరలడంతో వాహనదారుడి పైకి దూసుకెళ్ళిన కారు
- May 28, 2021
యూఏఈ: కారు నడుపుతున్న వ్యక్తి దృష్టి మరలడంతో, ఆ కారుని ఓ ద్విచక్రవాహనంపైకి ఎక్కించేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటనకు సంబంధించి అబుదాబీ పోలీస్, ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంగా ఎడమ వైపు లేన్ ద్వారా నిందితుడు తన కారుని పోనిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ, వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా వుండాలని అబుదాబీ పోలీసులు సూచించారు. డ్రైవింగ్ చేస్తూ అద్దంలో మేకప్ సరిచేసుకోవడం, ఫొటోలు తీసుకోవడం లేదా కారులోని ఇతర వ్యక్తులతో మాట్లాడటం వంటి వాటి వల్ల డ్రైవింగ్ చేసేవారి దృష్టి మరలే అవకాశం వుంది. ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడితే 800 దిర్హాముల జరిమానా, 4 బ్లాక్ పాయింట్లు విధిస్తారు.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







