సేలరీ రికార్డుల ఫోర్జరీ: ప్రైవేటు కంపెనీ సిబ్బంది పై విచారణ

- May 29, 2021 , by Maagulf
సేలరీ రికార్డుల ఫోర్జరీ: ప్రైవేటు కంపెనీ సిబ్బంది పై విచారణ

మనామా: ఓ ప్రైవేటు కంపెనీ మాజీ ఉద్యోగి హై క్రిమినల్ కోర్టులో ఫోర్జరీ కేసుకి సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నరు. జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్స్యూరెన్స్ (GOSI) సేలరీ రికార్డుల్ని ఫోర్జరీ చేశాడన్నది నిందితుడిపై మోబడ్డ అభియోగం. అనుమానాస్పదంగా వేతన పెంపు కనిపించడంపై జీఓఎస్ఐ అధికారులు విచారణ జరపగా ఈ ఫోర్జరీ బయటపడింది. మూడు సందర్భాల్లో నిందితుడు తన వేతన పెంపు కోసం ఫోర్జరీకి పాల్పడ్డాడు. 1950 నుంచి 3,300 బహ్రెయినీ దినార్స్ వరకు వేతనాన్ని పెంచుకున్నాడు నిందితుడు. తొలుత 2,100 బహ్రెయినీ దినార్స్ వరకు వేతనాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత 2,774 బహ్రెయినీ దినార్స్ పెంచుకున్నాడు. ఆ తర్వాత కంపెనీ, అతన్ని సస్పెండ్ చేసింది ఇతర కారణాలతో. అయితే, నిందితుడు ఆ తర్వాత కూడా తన వేతనాన్ని 3,300 బహ్రెయినీ దినార్లకు పెంచుకున్నాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందేందుకుగాను.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com