కోవిడ్ థర్డ్ వేవ్ అవగాహన బుక్లెట్ విడుదల చేసిన కమిషనర్ వీసీ సజ్జనార్
- June 02, 2021
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చేతుల మీదుగా కోవిడ్ థర్డ్ వేవ్ అవగాహన బుక్లెట్ విడుదల చేసిన మెడికవర్ హాస్పిటల్స్.కోవిడ్ థర్డ్ వేవ్ గురించిన సంక్షిప్త సమాచారాన్ని పొందుపరిచినా బుక్లెట్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.పి సజ్జనార్ విడుదల చేసారు.మూడవ వేవ్ లో కరోనా ఎలాంటి వ్యక్తులపైనా ప్రభావం చూపుతుంది,పిల్లలను కోవిడ్ బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలి,ఒకవేళ కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే అన్ని రకాల అంశాలను క్లుప్తంగా ఈ బుక్లెట్ లో పొందుపరిచారు.
మూడవ వేవ్ లో అత్యధికంగా చిన్న పిల్లలు కరోనా బారిన పడే అవకాశం ఎక్కువ అని అన్ని సర్వేలు తెలుపుతున్న నేపథ్యంలో మనం అందరం అత్యంత జాగ్రత్త వహించాలి.ముఖ్యంగా రోగనిరోధకశక్తి తక్కువ ఉన్న పిల్లలలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.పిల్లల కు పౌష్టికాహారం అందించడం ద్వారా వారికి రోగనిరోధకశక్తి పెరిగి ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉండగలరు.
పిల్లల విషయంలో తల్లిదండ్రులు అత్యంత శ్రద్ధ వహించాలి.మూడవ వేవ్ పొంచిఉన్న నేపథ్యంలో పిల్లలు అన్నిరకాల వైద్య సేవలనందించడానికి మెడికవర్ హాస్పిటల్స్ పీడియాట్రిక్ అండ్ నియోనాటాలజీ విభాగం పూర్తి సన్నద్ధంగా ఉంది.అన్నిరకాల ఎమర్జెన్సీ ,నాన్ ఎమర్జెన్సీ సేవలని అందుబాటులో ఉంచుతున్నాము.ఈ తరుణం లో మా మెడికల్ , నర్సింగ్, విద్య సిబ్బంది పూర్తి నిబద్దతతో వ్యవహరిస్తున్నారు అని సీనియర్ పీడీయాట్రిక్ అండ్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె అన్నారు
ఈ కార్యక్రమంలో చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ ,సీనియర్ పీడీయాట్రిక్ అండ్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె ,ఎస్.సి.ఎస్.సి సెక్రటరీ కృష్ణ ఏదుల,సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ రెడ్డి,మెడికవర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ ,చీఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ దెగ్లూర్కర్ పాల్గొన్నారు.
ఈ బుక్లెట్ ను మెడికవర్ హాస్పిటల్స్ వెబ్సైటు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు . మరిన్ని వివరాలకు http://www.medicoverhospitals.in కు లాగిన్ అవ్వండి.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







