కోవిడ్ నిబంధనలు పాటించని 390 మందిపై చ‌ర్య‌లు

- June 03, 2021 , by Maagulf
కోవిడ్ నిబంధనలు పాటించని 390 మందిపై చ‌ర్య‌లు

దోహా: కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌కుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన  వారిని ఉపేక్షించేది లేద‌ని ఖ‌తార్ అధికారులు మ‌రోసారి హెచ్చ‌రించారు.కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌కపోవ‌టం అంటే చ‌ట్ట‌విరుద్ధ చ‌ర్య‌ల‌కు ప‌ల్ప‌డుతున్న‌ట్లేన‌ని స్ప‌ష్టం చేసింది. కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన వారిపై ఇప్ప‌టికే వేల సంఖ్య‌లో కేసులు న‌మోదు చేసిన ఖ‌తార్ అధికారులు...తాజాగా మ‌రో 390 మందిపై చ‌ర్య‌లు తీసుకుంది. ఇందులో 355 మంది ఫేస్ మాస్క్ ధ‌రించ‌లేద‌ని వెల్లడించారు. వాహనంలో పరిమితికి మించి ప్రయాణించినందుకు మరో 14 మంది కేసు నమోదు చేశారు. కోవిడ్ రూల్స్ ప్రకారం ఒక వాహనంలో డ్రైవర్ తో సహా నలుగురు మాత్రమే ప్రయాణించాలి. కుటుంబసభ్యులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే క్వారంటైన్ రూల్స్ బ్రేక్ చేసిన ఓ వ్యక్తితో పాటు ఎతెరాజ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోని ఇద్దరు వ్యక్తులపై న‌మోదు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. కోవిడ్ నిబంధనలు పాటించని వాళ్లందర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com