ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్న APSRTC
- June 04, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిక్ బస్సులను నడిపే అంశంపై మళ్లీ ఫోకస్ పెట్టింది ఏపీఎస్సార్టీసీ.350 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ భావిస్తుంది.ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై బిడ్లను ఆహ్వానించిన ఏపీఎస్సార్టీసీ…విశాఖకు 100, విజయవాడ, తిరుపతి, తిరుమల ఘాట్ రోడ్, కాకినాడ, అమరావతికి నగరాలకు 50 బస్సులు చొప్పున కేటాయించింది ఏపీ ప్రభుత్వం. కేంద్రం నుంచి ప్రొత్సహకం రూపంలో బస్సుకు రూ.55 లక్షలు రానున్నాయి. గతంతో పోలిస్తే ఈ-బస్ బ్యాటరీ ధరలు తగ్గాయి.50 శాతం మేర బ్యాటరీ తగ్గడంతో నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందంటున్న ఆర్టీసీ.ఈ నెల 9వ తేదీలోగా బిడ్లు దాఖలుకు చివరి తేదీ ఖరారు చేయనుంది.గతంలో ఈ-బస్ల నిర్వహణ ప్రతిపాదనను పరిశీలించి జూడిషీయరీ ప్రివ్యూ అభ్యంతరాలతో వెనక్కు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుండడంతో ఎలక్ట్రిక్ బస్సుల ప్రతిపాదనను మళ్లీ తెర మీదకు తెచ్చింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష