కోవిడ్ పేషెంట్లలో 93% వ్యాక్సిన్ తీసుకోని వారే!
- June 06, 2021
కువైట్: వ్యాక్సిన్ తీసుకున్నవారితో పోలిస్తే వ్యాక్సిన్ తీసుకోని వారిపైనే కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్నట్లు కువైట్ గణాంకాలు చెబుతున్నాయి. కోవిడ్ తో ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో అధిక శాతం వ్యాక్సిన్ తీసుకోనివారే కావటం గమానార్హం. వ్యాక్సిన్ తీసుకున్న వారు వైరస్ బారిన పడుతున్నా..వారు ఆస్పత్రి వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారు. ప్రస్తుతం కువైట్ ఆస్పత్రులు, ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారిలో 93% మంది వ్యాక్సిన్ తీసుకోని వారేనని గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే..వ్యాక్సిన్ ద్వారా 100 శాతం కోవిడ్ ను నియంత్రించే అవకాశాలు లేకున్నా..వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కమ్యూనిటీ ఇమ్యూనిటీ సాధించే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







