కోవిడ్ పేషెంట్లలో 93% వ్యాక్సిన్ తీసుకోని వారే!
- June 06, 2021
కువైట్: వ్యాక్సిన్ తీసుకున్నవారితో పోలిస్తే వ్యాక్సిన్ తీసుకోని వారిపైనే కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్నట్లు కువైట్ గణాంకాలు చెబుతున్నాయి. కోవిడ్ తో ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో అధిక శాతం వ్యాక్సిన్ తీసుకోనివారే కావటం గమానార్హం. వ్యాక్సిన్ తీసుకున్న వారు వైరస్ బారిన పడుతున్నా..వారు ఆస్పత్రి వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారు. ప్రస్తుతం కువైట్ ఆస్పత్రులు, ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారిలో 93% మంది వ్యాక్సిన్ తీసుకోని వారేనని గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే..వ్యాక్సిన్ ద్వారా 100 శాతం కోవిడ్ ను నియంత్రించే అవకాశాలు లేకున్నా..వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కమ్యూనిటీ ఇమ్యూనిటీ సాధించే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







