దిల్లీ ఆసుపత్రిలో 'మలయాళ' దుమారం...మాటను వెనక్కు తీసుకున్న ఆసుపత్రి

- June 06, 2021 , by Maagulf
దిల్లీ ఆసుపత్రిలో \'మలయాళ\' దుమారం...మాటను వెనక్కు తీసుకున్న ఆసుపత్రి

మలయాళ భాషకు సంబంధించి దిల్లీ జిప్​మెర్​ జారీ చేసిన ఆదేశాలపై తీవ్రస్థాయిలో దుమారం చెలరేగింది. నర్సులు.. పని ప్రదేశంలో మలయాళం మాట్లాడకూడదని.. హిందీ లేదా ఇంగ్లీష్​నే వాడాలని స్పష్టం చేసింది. అయితే.. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన కారణంగా ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది ఆసుపత్రి.

ఇది భాష వివక్షత అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రముఖులు.

జిప్​మెర్​ ఏమంది?
"ఎక్కువ మంది రోగులు, సిబ్బందికి మలయాళం రాదు. దీంతో వారు నిస్సహాయులుగా భావించడం మూలంగా చాలా అసౌకర్యం కలుగుతోంది" అని జిప్​మెర్​ వివరించింది. మలయాళ భాషపై ఓ రోగి చేసిన ఫిర్యాదు మేరకే ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపింది.కానీ ఉత్తర్వులపై తీవ్ర వ్యక్తిరేకత ఎదురైన కారణంగా వాటిని ఉపసంహరించుకుంది. అప్పటికే ఈ వ్యవహారంపై రాజకీయంగా చర్చనీయాశమైంది. 

జిప్​మెర్​ ఆదేశాలపై నర్సింగ్​ సంఘాలు, రాజకీయ నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 

ప్రముఖుల స్పందన:
ఆసుపత్రి చర్యను దుయ్యబట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. "దేశంలోని ఇతర భాషల్లాగే మలయాళం కూడా భారతీయ భాషే. భాష పరమైన వివక్షను ఆపండి."-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

అనాగరిక, రాజ్యాంగ విరుద్ధ ఉత్తర్వులను రద్దు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ను కోరారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణు గోపాల్. "ప్రపంచవ్యాప్తంగా రోగుల క్షేమం కోసం కేరళ నర్సులు పనిచేస్తున్నారు. ఒక ప్రాంతానికి చెందినవారు వారిలో వారు మాతృభాషలో మాట్లాడతారు. భాష తెలియనివారితోనూ మలయాళంలోనే మాట్లాడతారని అనుకోవడంలో అర్థం లేదు. ఈ ఆదేశాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా, వివక్షపూరితం."- కేసీ వేణు గోపాల్, కాంగ్రెస్ ఎంపీ

"భాష అర్థమయ్యే వారితో తమ మాతృభాషలో మాట్లాడవద్దని ప్రజాస్వామ్య భారత్​లో ఓ ప్రభుత్వ సంస్థ చెప్పడం విడ్డూరం. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆదేశాలు భారత పౌరుల మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలి," అని తిరువనంతపురం ఎంపీ శశి థరూర్​ ట్వీట్​ చేశారు.

"ఈ ఆదేశం భాషా జాతివాదాన్ని సూచిస్తుంది. భారతదేశంలో 22 అధికారిక భాషలు ఉన్నాయి. అందులో మలయాళం, తెలుగు, తమిళం, హిందీ మొదలైనవి కూడా ఉన్నాయి. ప్రతి భారతీయుడికి తమకు నచ్చిన భాషలో సంభాషించే హక్కు ఉండాలి. ఆ ప్రాథమిక హక్కును ఎవరూ ఉల్లంఘించకూడదు" అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com