సూటిగా ప్రశ్నించిన కేజ్రీవాల్
- June 06, 2021
న్యూఢిల్లీ: ఈ ప్రశ్న అడిగింది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ ప్రభుత్వ పథకాల్లో ముఖ్యమైనదైన ఇంటికే రేషన్ పథకం మరో వారంలో ప్రారంభమవుతుందనగా లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ దానిని నిలిపేశారు. దీనిపై కేజ్రీవాల్ చాలా ఘాటుగా స్పందించారు. పిజ్జా హోమ్ డెలివరీ చేస్తున్నప్పుడు రేషన్ చేస్తే తప్పేముంది అని ఆయన ప్రశ్నించారు. రేషన్ మాఫియాను అడ్డుకోవడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని అడిగారు. తమ అనుమతి తీసుకోలేదని కేంద్రం చెబుతున్నదని, నిజానికి చట్టప్రకారం ఇది అవసరం లేకపోయినా తాము మాత్రం ఐదుసార్లు కేంద్రం అనుమతి కోరామని కేజ్రీవాల్ చెప్పారు.
రేషన్ మాఫియాకు చెక్ పెట్టడానికి తొలిసారి ఓ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ వాళ్లు ఎంత శక్తివంతులో చూడండి. దానిని అమలు చేసే వారం ముందు ఆ పథకాన్ని రద్దు చేయించారు అని కేజ్రీవాల్ అన్నారు. ముందుస్తు అనుమతి కోరలేదంటూ శనివారం లెఫ్ట్నెంట్ గవర్నర్ ఈ పథకాన్ని రద్దు చేశారు. కేంద్రం ఆమోదించలేదని, కోర్టు కేసు నడుస్తోందని రెండు చెల్లని కారణాలను అనిల్ బైజాల్ చెప్పారని ఢిల్లీ పౌరసరఫరాల శాఖ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ ఆరోపించారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకానికి ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజనా అనే పేరు పెట్టారు. ఈ పథకంలో భాగంగా బియ్యం, గోధుమ పిండిని అర్హులైన వారికి ఇంటికి నేరుగా సరఫరా చేస్తామని ఆప్ ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









