బంగారు నగలపై ఫోర్జరీ ముద్ర..ఆసియా వ్యక్తి అరెస్ట్
- June 13, 2021కువైట్: బంగారు ఆభరణాలపై వాణిజ్య మంత్రిత్వ శాఖ ఫోర్జరీ ముద్రను వేసినందుకు ఆసియా జాతీయుడిని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది.బంగారు నగల విక్రయాలకు ముందుగా ఆయా నగల స్వచ్ఛత, బరువును తనిఖీ చేసి అన్ని సరిగ్గా ఉంటేనే వాణిజ్య మంత్రిత్వ శాఖ ముద్ర వేస్తుంది.ఆ తర్వాతే బంగారు నగలు అమ్మకానికి వీలుంటుంది. అయితే..ఆసియాకు చెందిన వ్యక్తి మాత్రం మంత్రిత్వ శాఖ తనిఖీలు లేకుండానే నకిలీ మినిస్ట్రి స్టాంప్ తో మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు.క్రిమినల్ సెక్యూరిటీ విభాగం, వాణిజ్య మంత్రిత్వ శాఖ సంయుక్త ఆపరేషన్లో ఫోర్జరీ గుట్టు బయటపడింది. దీంతో అతన్ని అధికారులు అరెస్టు చేశారు. స్టాంప్ను ఫోర్జరీ చేసేందుకు వినియోగించిన లేజర్ పరికరం, ల్యాప్టాప్ కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!