కనీసం తొలి డోస్ తీసుకున్న వారికే హజ్ యాత్రకు అనుమతి

- June 13, 2021 , by Maagulf
కనీసం తొలి డోస్ తీసుకున్న వారికే హజ్ యాత్రకు అనుమతి

సౌదీ: కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది హజ్ యాత్రికుల సంఖ్యను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.హజ్ యాత్రకు తమ పేర్లను నమోదు చేసుకున్నవారు తప్పనిసరిగా వ్యాక్సిన్ పొంది ఉండాలని కూడా క్లారిటీ ఇచ్చింది. కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ పొందిన వారికే హజ్ ప్రార్ధనలకు అనుమతి ఉంటుందని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తవ్ఫిక్ అల్-రబియా తాజాగా ప్రకటించారు.రిజిస్ట్రేషన్లలో నికిలీలకు తావులేకుండా, వ్యాక్సిన్ తీసుకున్నవారికే ఖచ్చితమైన రిజిస్ట్రేషన్లు నిర్వహించేలా ఈ-సిస్టం వ్యవస్థ పని చేస్తుందని మంత్రి వివరించారు. అలాగే మక్కాలోని మూడు ఆస్పత్రుల్లో కావాల్సిన వైద్య పరికరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భక్తులను కోవిడ్ ముప్పు నుంచి తప్పించేందుకే హజ్ యాత్రికుల సంఖ్యను పరిమితం చేసినట్లు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com