కనీసం తొలి డోస్ తీసుకున్న వారికే హజ్ యాత్రకు అనుమతి
- June 13, 2021సౌదీ: కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది హజ్ యాత్రికుల సంఖ్యను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.హజ్ యాత్రకు తమ పేర్లను నమోదు చేసుకున్నవారు తప్పనిసరిగా వ్యాక్సిన్ పొంది ఉండాలని కూడా క్లారిటీ ఇచ్చింది. కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ పొందిన వారికే హజ్ ప్రార్ధనలకు అనుమతి ఉంటుందని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తవ్ఫిక్ అల్-రబియా తాజాగా ప్రకటించారు.రిజిస్ట్రేషన్లలో నికిలీలకు తావులేకుండా, వ్యాక్సిన్ తీసుకున్నవారికే ఖచ్చితమైన రిజిస్ట్రేషన్లు నిర్వహించేలా ఈ-సిస్టం వ్యవస్థ పని చేస్తుందని మంత్రి వివరించారు. అలాగే మక్కాలోని మూడు ఆస్పత్రుల్లో కావాల్సిన వైద్య పరికరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భక్తులను కోవిడ్ ముప్పు నుంచి తప్పించేందుకే హజ్ యాత్రికుల సంఖ్యను పరిమితం చేసినట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ