జీ7 కీలక నిర్ణయం
- June 13, 2021లండన్: జీ 7 దేశాల సదస్సు బ్రిటన్లో జరుగుతున్నది.జీ7 సభ్యదేశాల అధినేతలు ఆ సదస్సులో పాల్గోన్న సంగి తెలిసిందే.ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న తరుణంలో ఎదుర్కొంటున్న సమస్యలపై, మహమ్మారిని తరిమికొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు.ఇక, ఇలాంటి మహమ్మారులు భవిష్యత్తులు ఎదురైతే ఎక్కువసమయం తీసుకోకుండా 100 రోజుల్లోనే మహమ్మారులకు చెక్ పెట్టేందుకు అనుగుణంగా సమర్ధవంతమైన టీకాలను అభివృద్ది చేయాలని సభ్యదేశాలు నిర్ణయం తీసుకున్నాయి.18 నెలల కాలంలో తెలుసుకున్న అనుభవాల దృష్ట్యా సభ్యదేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇక, కరోనా తొలిదశలో చైనా విషయాన్ని దాచిపెట్టడంపై జీ7 దేశాలు విరుచుకుపడ్డాయి. అయితే, చైనాను మరింత కట్టడి చేసేందుకు అమెరికా ప్రతిపాదనలు ప్రకటించగా దానికి కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మద్దుతు తెలిపాయి.జర్మనీ, జపాన్, ఇటలీ దేశాలు తమ మద్దతును తెలపాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు