కువైట్ నుంచి భారత్ కు 8000 ఆక్సిజన్ సిలిండర్లు
- June 14, 2021
కువైట్ సిటీ: కోవిడ్ సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు భారత్ బాసటగా నిలిచిన కువైట్..మరో విడతగా ఆక్సిజన్ సిలిండర్లను పంపుతోంది. కువైట్లోని ఇండియన్ కమ్యూనిటీ సౌజన్యంతో 8000 ఆక్సిజన్ సిలిండర్లను షువైఖ్ నౌకాశ్రయం నుంచి తరలిస్తున్నారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ శార్దూల్ ద్వారా నేవీ బృందం ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్లనుంది. కువైట్లోని భారత రాయబారి సిబి జార్జ్, కువైట్ పోర్ట్స్ అథారిటీ జనరల్ డైరెక్టర్ షేక్ యూసుఫ్ అబ్దుల్లా అల్ సబా, పబ్లిక్ అథారిటీ ఆఫ్ ఇండస్ట్రీ జనరల్ డైరెక్టర్ అబ్ధుల్ కరీం అల్ తకీ ఆక్సిజన్ సిలిండర్ల తరలింపునకు సంబంధించి అధికారిక ప్రక్రియను పూర్తి చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ ను ఎదుర్కోనేందుకు కువైట్ ముందు నుంచి భారత్ కు బాసటగా నిలుస్తోంది. కువైట్లోని భారతీయులు తమ వంతు సాయం అందిస్తుండటంతో ఇప్పటికే పలు
విడతలుగా ఆక్సిజన్ సిలిండర్లు, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఇతర వైద్య పరికాలను పంపించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







