12-17 ఏళ్ల వారికి వ్యాక్సిన్ వేయించాలని కోరిన బహ్రెయిన్
- June 17, 2021
బహ్రెయిన్: కోవిడ్ వేరియంట్లతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉందని నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ పిలుపునిచ్చింది.
ముఖ్యంగా 12-17 ఏళ్ల వారికి వారి తల్లిదండ్రులు టీకాలు వేయించాలని టాస్క్ ఫోర్స్ సభ్యుడు, మైక్రోబయాలిస్ట్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ మనఫ్ అల్ ఖహ్తానీ అన్నారు. రానున్న రోజుల్లో డెల్టా వేరియంట్ తో ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కొత్త వేరియంట్లతో అన్ని వర్గాలపై ప్రభావం ఉంటుందని, ప్రధానంగా పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడే వ్యాక్సిన్ వేయించుకోవటం ద్వారా వైరస్ తీవ్రతను నియంత్రించేందుకు ఆస్కారం ఉంటుందని మనఫ్ అల్ కహ్తానీ అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







