వ్యాక్సిన్లు తీసుకున్న ప్రవాసీయులను అనుమతిస్తారా?

- June 17, 2021 , by Maagulf
వ్యాక్సిన్లు తీసుకున్న ప్రవాసీయులను అనుమతిస్తారా?

కువైట్: కరోనా నేపథ్యంలో కువైట్ ట్రావెల్ బ్యాన్ ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో, వివిధ కారణాల చేత తమ దేశాలకు వెళ్ళిన ఎందరో ప్రవాసీయులు అక్కడే చిక్కుపోయారు. ఎందరో తమ కష్టాలను అటు భారత ప్రభుత్వానికి, ఇటు నివసిస్తున్న ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటున్నారు. భారత్ అంతర్జాతీయ విమానాలపై జులై 6 వరకు బ్యాన్ విధించింది. గడువు పూర్తవుతుండడంతో ప్రవాసీయులలో ఆత్రుత నెలకొంది.

అయితే, ఎవరైతే వ్యాక్సిన్లు తీసుకున్నారో వాళ్ళను కువైట్ కు అనుమతించాలంటూ మంత్రిమండలికి సిఫారసు చేసింది సుప్రీం కమిటీ ఫర్ కరోనా ఎమర్జెన్సీ.

కువైట్ లో తాజాగా 'డెల్టా వేరియంట్' నమోదవడంతో పరిస్థితులను మరింత జాగ్రత్తగా అంచనావేస్తోంది కువైట్ ప్రభుత్వం. సుప్రీం కమిటీ చేసిన సిఫారసును మంత్రి మండలి చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటుంది అని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com