భారత్ లోని అన్ని వాహనాలకు ఒకే సర్టిఫికేట్
- June 17, 2021
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఒకే విధమైన కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ను జారీ చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. అలాగే, కొత్తగా తిరస్కరణ సర్టిఫికేట్’ విధానాన్ని తెచ్చినట్టు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రిత్వ శాఖ ఇకమీదట అన్ని వాహనాలకు కాలుష్య నియంత్రణ(పీయూసీ) ధృవీకరణ సర్టిఫికేట్ జారీ చేయనున్నట్టు స్పష్టం చేసింది.
దీనిపై క్యూఆర్ కోడ్ను కూడా ముద్రించనున్నట్టు, అదేవిధంగా పీయూసీ డేటాను నేషనల్ రిజిస్టర్కు లింక్ చేయనున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా 1989 మోటార్ వాహనాల నిబంధనల్లో మార్పులు చేసినట్టు కేంద్రం పేర్కొంది. అలాగే, మొదటిసారిగా తిరస్కరణ పత్రం అనే విధానాన్ని ప్రారంభిస్తున్నట్టు నోటిఫికేషన్లో తెలిపింది. అనుమతించిన స్థాయి కంటే ఎక్కువగా ఉద్గారాలు వెలువడుతున్నట్టుగా తేలితే ఈ తిరస్కరణ సర్టిఫికేట్ను వాహన యజమానికి ఇవ్వనున్నారు. కొత్త నిబంధనలు పాటించకపోతే వాహన రిజిస్ట్రేషన్తో పాటు పర్మిట్ను రద్దు చేసే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







