UPDATE: వ్యాక్సిన్లు తీసుకున్న ప్రవాసీయులకు అనుమతి

- June 17, 2021 , by Maagulf
UPDATE: వ్యాక్సిన్లు తీసుకున్న ప్రవాసీయులకు అనుమతి

కువైట్: కరోనా నేపథ్యంలో కువైట్ ట్రావెల్ బ్యాన్ ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో, వివిధ కారణాల చేత తమ దేశాలకు వెళ్ళిన ఎందరో ప్రవాసీయులు అక్కడే చిక్కుపోయారు. ఎందరో తమ కష్టాలను అటు భారత ప్రభుత్వానికి, ఇటు నివసిస్తున్న ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటున్నారు. భారత్ అంతర్జాతీయ విమానాలపై జులై 6 వరకు బ్యాన్ విధించింది. గడువు పూర్తవుతుండడంతో ప్రవాసీయులలో ఆత్రుత నెలకొంది.

అయితే, ఎవరైతే వ్యాక్సిన్లు తీసుకున్నారో వాళ్ళను కువైట్ కు అనుమతించాలంటూ మంత్రిమండలికి సిఫారసు చేసింది సుప్రీం కమిటీ ఫర్ కరోనా ఎమర్జెన్సీ.

కువైట్ లో తాజాగా 'డెల్టా వేరియంట్' నమోదవడంతో పరిస్థితులను మరింత జాగ్రత్తగా అంచనావేస్తోంది కువైట్ ప్రభుత్వం. సుప్రీం కమిటీ చేసిన సిఫారసును మంత్రి మండలి  ఆమోదిస్తూ వ్యాక్సిన్లు తీసుకున్న ప్రవాసీయులను మాత్రమే ఆగస్టు ప్రారంభంలో కువైట్ కు అనుమతిస్తూ ప్రకటన జారీ చేసింది.

ఎవరికి అనుమతి?
కోవిడ్ వ్యాక్సిన్లు ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా యొక్క రెండు డోసులు లేదా జాన్సన్ & జాన్సన్ వారి సింగల్ డోసు వ్యాక్సిన్ పొందిన వారు అర్హులు..అయితే, ఆగష్టు 1 కల్లా వ్యాక్సిన్ల డోసులు ముగిసి ఉండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com