వ్యాక్సిన్ తీసుకున్నవారికే పబ్లిక్ ప్రాంతాల్లోకి అనుమతి

- June 18, 2021 , by Maagulf
వ్యాక్సిన్ తీసుకున్నవారికే పబ్లిక్ ప్రాంతాల్లోకి అనుమతి

కువైట్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా షాపింగ్ మాల్స్ వంటి పబ్లిక్ ప్రాంతాల్లోకి వ్యాక్సిన్ పొందినవారిని మాత్రమే అనుమతించనున్నట్లు కువైట్ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ పొందని వారికి పబ్లిక్ ప్రాంతాల్లో ఎంట్రీ ఉండదని స్పష్టం చేసింది. పెద్ద పెద్ద షాపింప్ మాల్స్, జిమ్ములు, సెలూన్లు, ప్రభుత్వ సంస్థలు సేవలు అందించే సెంటర్లకు ఇక నుంచి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికే అనుమతించనున్నారు. ఈ నెల 27 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుంది. మాల్స్, సెలూన్లు, జిమ్ములతో పాటు ఇతర పబ్లిక్ సర్వీసు సెంటర్లకు వెళ్లే వారి 'ఇమ్యూన్' యాప్ ద్వారా వ్యాక్సిన్ స్టేటస్ ను ధృవీకరించుకున్న తర్వాతే లోనికి అనుమతిస్తారు. అంతేకాదు వ్యాక్సిన్ పొందిన కువైట్ పౌరులకు మాత్రమే విదేశాలకు వెళ్లి వచ్చేందుకు అనుమతి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. అయితే..వ్యాక్సిన్ తీసుకునేందుకు వైద్య పరంగా మినహాయింపు పొందినవారికి ఎలాంటి నిబంధనలు వర్తించవని వెల్లడించింది. ఇక విదేశీయుల రాకపై కూడా కీలక ప్రకటన చేసింది. ఆగస్ట్ 1 నుంచి ఫారెనర్లను దేశంలోకి అనుమతించనున్నట్లు వెల్లడించింది. అయితే..కువైట్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన ఫైజర్, ఆస్ట్రాజెన్కా, మోడెర్న వ్యాక్సిన్ అయితే రెండు డోసులు, జాన్సన్&జాన్సన్ అయితే వన్ షాట్ తీసుకోని ఉండాలని షరతు విధించింది. అలాగే కువైట్ బయల్దేరే సమయానికి 72 గంటల్లో పొందిన పీసీఆర్ నెగటీవ్ టెస్ట్ రిపోర్ట్ కూడా తప్పనిసరిగా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే..ఆగస్ట్ ఒకటి నుంచి విదేశీయులకు రాకకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించినా..రెడ్ లిస్ట్ దేశాల నుంచి కువైట్ వచ్చేందుకు ఎదురు చూస్తున్న వారి విషయంలో ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com