పూర్తిగా వ్యాక్సినేషన్ అయిన సిబ్బందితో ‘ఢిల్లీ నుంచి దుబాయ్’కి తొలి విమానం

- June 18, 2021 , by Maagulf
పూర్తిగా వ్యాక్సినేషన్ అయిన సిబ్బందితో ‘ఢిల్లీ నుంచి దుబాయ్’కి తొలి విమానం

దుబాయ్: ఢిల్లీ - దుబాయ్ మార్గంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తొలి అంతర్జాతీయ విమానాన్ని పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ పొందిన సిబ్బంది ద్వారా నడపడం ప్రారంభించింది. ఢిల్లీ నుంచి ఉదయం 10.40 నిమిషాలకు బయల్దేరిన విమాన సిబ్బంది పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ పొందారు. కెప్టెన్ డి.ఆర్. గుప్తా, కెప్టెన్ అలోక్ కుమార్ నాయక్ ఈ విమానాన్ని నడిపారు. క్యాబిన్ క్రూ మెంబర్స్ వెంకట్ కెల్లా, ప్రవీణ్ చంద్ర, ప్రవీణ్ చౌగ్లే మరియు మనీషా కాంబ్లెలతో విమానం బయల్దేరింది. అర్హులైన క్రూ మెంబర్స్ అలాగే ఫ్రంట్ లైన్ స్టాఫ్ అందరికీ వ్యాక్సినేషన్ చేయించినట్లు ఎయిర్ లైన్ సంస్థ వెల్లడించింది. వందే భారత్ మిషన్ ప్రారంభమయ్యాక ఓ విమానం పూర్తి వ్యాక్సినేషన్ జరిగిన సిబ్బందితో ఇండియా నుంచి ఆపరేట్ అవడం తమతోనే మొదలైందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com