కువైట్: కోవిడ్ తీవ్రతపై సమీక్షించిన మంత్రివర్గం
- June 22, 2021
కువైట్: తగ్గినట్లే తగ్గి మళ్లీ వైరస్ తీవ్రత మళ్లీ పెరగటంతో కువైట్ మంత్రిమండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం ఒక్కటిగా నిలిచి మహమ్మారిపై పొరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చింది. దేశంలో కోవిడ్ తీవ్రతపై ఆరోగ్య మంత్రి డాక్టర్ బాసెల్ అల్సాబా మంత్రి మండలికి వివరించారు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. కువైట్ ఆమోదించిన వ్యాక్సిన్ సురక్షితమైనవని, కమ్యూనిటీ ఇమ్యూనిటీ సాధించటంలో ఇవి దోహదపడుతాయని ధీమా వ్యక్తం చేశారు. వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. వ్యాక్సిన్ వేసుకోవటం ద్వారానే వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని పిలుపునిచ్చారు. ఇదిలాఉంటే కువైట్ వ్యాప్తంగా గత 24 గంటల్లో అత్యధికంగా 1,935 మంది వైరస్ బారిన పడ్డారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!
- సౌత్ సాద్ అల్-అబ్దుల్లా దుర్ఘటనలో ఒకరు మృతి..!!
- అభివృద్ధి ప్రాజెక్టులపై ధోఫార్ మున్సిపల్ కౌన్సిల్ సమీక్ష..!!
- యూనిఫైడ్ జిసిసి రోడ్ ట్రాన్స్పోర్ట్ చట్టంపై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- టీవీ లేకపోయినా పర్లేదు..మీ మొబైల్లో బడ్జెట్ స్పీచ్ చూసేయండి







