కువైట్: కోవిడ్ తీవ్రతపై సమీక్షించిన మంత్రివర్గం
- June 22, 2021
కువైట్: తగ్గినట్లే తగ్గి మళ్లీ వైరస్ తీవ్రత మళ్లీ పెరగటంతో కువైట్ మంత్రిమండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం ఒక్కటిగా నిలిచి మహమ్మారిపై పొరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చింది. దేశంలో కోవిడ్ తీవ్రతపై ఆరోగ్య మంత్రి డాక్టర్ బాసెల్ అల్సాబా మంత్రి మండలికి వివరించారు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. కువైట్ ఆమోదించిన వ్యాక్సిన్ సురక్షితమైనవని, కమ్యూనిటీ ఇమ్యూనిటీ సాధించటంలో ఇవి దోహదపడుతాయని ధీమా వ్యక్తం చేశారు. వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. వ్యాక్సిన్ వేసుకోవటం ద్వారానే వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని పిలుపునిచ్చారు. ఇదిలాఉంటే కువైట్ వ్యాప్తంగా గత 24 గంటల్లో అత్యధికంగా 1,935 మంది వైరస్ బారిన పడ్డారు.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







