కువైట్: కోవిడ్ తీవ్రతపై సమీక్షించిన మంత్రివర్గం
- June 22, 2021
కువైట్: తగ్గినట్లే తగ్గి మళ్లీ వైరస్ తీవ్రత మళ్లీ పెరగటంతో కువైట్ మంత్రిమండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం ఒక్కటిగా నిలిచి మహమ్మారిపై పొరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చింది. దేశంలో కోవిడ్ తీవ్రతపై ఆరోగ్య మంత్రి డాక్టర్ బాసెల్ అల్సాబా మంత్రి మండలికి వివరించారు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. కువైట్ ఆమోదించిన వ్యాక్సిన్ సురక్షితమైనవని, కమ్యూనిటీ ఇమ్యూనిటీ సాధించటంలో ఇవి దోహదపడుతాయని ధీమా వ్యక్తం చేశారు. వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. వ్యాక్సిన్ వేసుకోవటం ద్వారానే వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని పిలుపునిచ్చారు. ఇదిలాఉంటే కువైట్ వ్యాప్తంగా గత 24 గంటల్లో అత్యధికంగా 1,935 మంది వైరస్ బారిన పడ్డారు.
తాజా వార్తలు
- జులీబ్, షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్..!!
- గాజా కోసం అమెరికా శాంతి ప్రణాళిక..మొదటి దశపై బహ్రెయిన్ ప్రశంసలు..!!
- సముద్ర నావిగేషన్ను పునఃప్రారంభించిన ఖతార్..!!
- జాయెద్ ఇంటర్నేషనల్లో డిజిటల్ టూరిస్ట్ వాలెట్ ప్రారంభం..!!
- ప్రమాద బాధితుల వీడియో రికార్డ్..ఒమన్లో వ్యక్తి అరెస్టు..!!
- మక్కాలో మహిళలపై వేధింపులు..ఆఫ్ఘన్ జాతీయుడు అరెస్టు..!!
- అమెరికన్ ప్రతినిధుల బృందంతో సీఎం భేటీ..
- ఏపీ: త్వరలో భారీగా పోలీస్ నియామకాలు..
- ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్: సీపీ సజ్జనార్
- చంద్రబాబు పేదవాడికి భవిష్యత్ లేకుండా చేస్తున్నారు – జగన్