కువైట్: కోవిడ్ పేషెంట్లలో 60% మంది ప్రవాసీయులే!
- June 23, 2021
కువైట్: కువైట్లో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో ఎక్కువ మంది ప్రవాసీయులే ఉంటున్నారని కోవిడ్ సుప్రీమ్ అడ్వైజరీ కమిటీ వెల్లడించింది. ప్రస్తుత కోవిడ్ కేసుల్లో 40 శాతం మంది కువైట్ పౌరులని, మిగిలిన 60 శాతం మంది నాన్ కువైతీలేనని తెలిపింది. ఇక ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న వారిలో వ్యాక్సిన్ పొందని వారే అత్యధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న 98 శాతం మంది వ్యాక్సిన్ పొందని వాళ్లేనని ఫర్వానియా ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ విభాగం అధిపతి డాక్టర్ దలాల్ అల్-మాట్రౌక్ వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా కోవిడ్ తీవ్రతను తగ్గించవచ్చని సూచించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







