దుబాయ్ నుండి విజయవాడ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం
- June 23, 2021
దుబాయ్: భారత్ లో కరోనా ఉధృతి నేపథ్యంలో గత నెల 3 నుంచి ఇక్కడి విమానాశ్రయానికి విదేశీ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తూ పౌర విమానయానశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే, వందే భారత్ మిషన్లో భాగంగా తిరిగి మళ్ళీ విమాన సర్వీసులను ప్రారంభించిన విషయం తెలిసందే.నేడు IX 250 ఎయిర్ ఇండియా విమానంలో 100 మంది ప్రయాణికులు దుబాయ్ నుండి విజయవాడ కు చేరుకున్నారు.ఇందులో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుల భద్రతా, తనిఖీ ఏర్పాట్లను విమానాశ్రయ అధికారులు పర్యవేక్షించారు. తొలుత థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు, కస్టమ్స్ తనిఖీల అనంతరం రాష్ట్రంలోకి అనుమతినిచ్చారు. అలాగే ప్రవాసాంధ్రులను వారి వారి గమ్యస్థానాలు చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని విమానాశ్రయం డైరెక్టర్ మధుసూదన రావు తెలిపారు.




తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







