భారత్-దోహా వెళ్లే ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు...
- June 24, 2021
దోహా: భారత్ కు చెందిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ భారత్ నుండి ఖతార్ వెళ్లే ప్రయాణికులకు కొత్త ప్రయాణ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రయాణికులు తప్పనిసరిగా పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే ప్రత్యేకమైన పోర్టల్ నుంచి 10 రోజుల పాటు ఉండేందుకు హోటల్ రూమ్ బుక్ చేసుకోవడం కూడా తప్పనిసరి.ఎయిరిండియా ఎక్స్ప్రెస్ కొత్త ప్రయాణ మార్గదర్శకాల వివరాలు...
- ICMR ఆమోదం తెలిపిన లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి తీసుకున్న నెగెటివ్ కోవిడ్-19 పీసీఆర్ టెస్టు సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- విమానం బయల్దేరడానికి 48 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకోవాలి.
- తప్పనిసరిగా స్మార్ట్ఫోన్లో Ehteraz app డౌన్లోడ్ చేసుకోవాలి.
- ప్రయాణికులు తప్పనిసరిగా ఈ సర్టిఫికెట్ల ప్రింట్ కాపీలు తీసుకెళ్లాలి.
a) నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్
b) క్వారంటైన్లో ఉండేందుకు హోటల్ బుకింగ్కు సంబంధించిన ప్రూఫ్
c) ప్రవేశ అనుమతి
d) నింపిన హెల్త్ అసెస్మెంట్ ఫారం
- వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు దాని తాలూకు సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- 10 రోజుల క్వారంటైన్ కోసం Discover Qatar పోర్టల్ నుంచి మాత్రమే హోటల్ రూమ్ బుక్ చేసుకోవాలి. --రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









