భారత్-దోహా వెళ్లే ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు...
- June 24, 2021
దోహా: భారత్ కు చెందిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ భారత్ నుండి ఖతార్ వెళ్లే ప్రయాణికులకు కొత్త ప్రయాణ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రయాణికులు తప్పనిసరిగా పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే ప్రత్యేకమైన పోర్టల్ నుంచి 10 రోజుల పాటు ఉండేందుకు హోటల్ రూమ్ బుక్ చేసుకోవడం కూడా తప్పనిసరి.ఎయిరిండియా ఎక్స్ప్రెస్ కొత్త ప్రయాణ మార్గదర్శకాల వివరాలు...
- ICMR ఆమోదం తెలిపిన లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి తీసుకున్న నెగెటివ్ కోవిడ్-19 పీసీఆర్ టెస్టు సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- విమానం బయల్దేరడానికి 48 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకోవాలి.
- తప్పనిసరిగా స్మార్ట్ఫోన్లో Ehteraz app డౌన్లోడ్ చేసుకోవాలి.
- ప్రయాణికులు తప్పనిసరిగా ఈ సర్టిఫికెట్ల ప్రింట్ కాపీలు తీసుకెళ్లాలి.
a) నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్
b) క్వారంటైన్లో ఉండేందుకు హోటల్ బుకింగ్కు సంబంధించిన ప్రూఫ్
c) ప్రవేశ అనుమతి
d) నింపిన హెల్త్ అసెస్మెంట్ ఫారం
- వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు దాని తాలూకు సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- 10 రోజుల క్వారంటైన్ కోసం Discover Qatar పోర్టల్ నుంచి మాత్రమే హోటల్ రూమ్ బుక్ చేసుకోవాలి. --రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







