శంషాబాద్ విమానాశ్రయంలో విలువైన ఐఫోన్లు పట్టివేత
- June 24, 2021
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో తాజాగా గురువారం మరో అక్రమ రవాణా బయటపడింది.శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులు భారీగా ఐఫోన్లను సీజ్ చేశారు.
షార్జా నుంచి వచ్చి ఇద్దరు ప్రయాణికులు 80 ఐ ఫోన్లను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న అధికారులు సోదాలు నిర్వహించారు.పట్టుబడ్డ ఇద్దరిని పోలీసులు విచారించారు.పట్టుబడ్డ ఐఫోన్లను సీజ్ చేసిన పోలీసులు విమానాశ్రయం పోలీస్ స్టేషన్కు తరలించారు.కాటన్లలో భారీగా తరలిస్తున్న ఫోన్లను చూసిన అధికారులు షాక్ అయ్యారు.
ఇదిలా ఉంటే తాజాగా మూడు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టుబడిన విషయం తెలిసిందే.టాంజానియా నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తి నుంచి పెద్దమొత్తంలో హెరాయిన్ ను పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. టాంజానియా దేశస్తుడు జాన్ విలియమ్స్ నుంచి దాదాపు 20 కోట్ల విలువ చేసే డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!









