పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- March 20, 2026
మచిలీపట్నం: మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గఅభివృద్ధి ద్యేయoగా నిరంతరం ప్రజలలో తిరుగుతూ ప్రజలమనిషిగా మన్ననలు పొందిన దీశాలి ఎంపీ బాలసౌరి అనడంలో అతిశయోక్తి లేదు.నిరంతరం ప్రజలకు ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తూ మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ సర్వేకి కృషిచేసి నిధులు మంజూరు అయ్యేలా చేయడం, ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకు లో విలీనమైన తర్వాత ఆంధ్ర ప్రజల గుండె చప్పుడును గ్రహించి ఆంధ్ర బ్యాంకు నిర్మాత డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో 40 కోట్ల రూపాయల విలువ చేసే స్మారక భవనాన్ని నిర్మించేలా యూనియన్ బ్యాంక్ ప్రతినిధులతో మాట్లాడి, నిధులు మంజూరు చేశారు. కానీ మున్సిపల్ నగరపాలక సంస్థ లో ఎప్పటికప్పుడు బిల్లును అడ్డుకుంటూ వైసీపీ నేతలు చేసిన ఆగడాలకు ఎంపీ బాలశౌరి చెక్ పెట్టారు. ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించిన గంటల వ్యవధిలోనే పెండింగ్లో ఉన్న బిల్లును ఆమోదించేలాగా అధికారులతో మాట్లాడి పరిపాలన అనుమతులు తీసుకురావడం పట్ల ప్రజలు జనసేన అభిమానులు కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వేసిన చలోక్తులు నిజం చేస్తూ రెండు అడుగులు వెనక్కు వేసినంత మాత్రాన విజేత పోటీలో ఓడిపోవడం కాదని 20 అడుగులు ముందుకు వెళ్లడానికి ప్రయత్నమని ఈ ఘటనతో ఎంపీ బాలశౌరి నిరూపించారు. మంచివారి మౌనం వెనుక అనేక రాజనీతి ఆలోచనలు ఉంటాయని ఎంపీ బాలసౌరి మరోసారి నిరూపించారు.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







