పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- March 20, 2026
మచిలీపట్నం: మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గఅభివృద్ధి ద్యేయoగా నిరంతరం ప్రజలలో తిరుగుతూ ప్రజలమనిషిగా మన్ననలు పొందిన దీశాలి ఎంపీ బాలసౌరి అనడంలో అతిశయోక్తి లేదు.నిరంతరం ప్రజలకు ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తూ మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ సర్వేకి కృషిచేసి నిధులు మంజూరు అయ్యేలా చేయడం, ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకు లో విలీనమైన తర్వాత ఆంధ్ర ప్రజల గుండె చప్పుడును గ్రహించి ఆంధ్ర బ్యాంకు నిర్మాత డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో 40 కోట్ల రూపాయల విలువ చేసే స్మారక భవనాన్ని నిర్మించేలా యూనియన్ బ్యాంక్ ప్రతినిధులతో మాట్లాడి, నిధులు మంజూరు చేశారు. కానీ మున్సిపల్ నగరపాలక సంస్థ లో ఎప్పటికప్పుడు బిల్లును అడ్డుకుంటూ వైసీపీ నేతలు చేసిన ఆగడాలకు ఎంపీ బాలశౌరి చెక్ పెట్టారు. ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించిన గంటల వ్యవధిలోనే పెండింగ్లో ఉన్న బిల్లును ఆమోదించేలాగా అధికారులతో మాట్లాడి పరిపాలన అనుమతులు తీసుకురావడం పట్ల ప్రజలు జనసేన అభిమానులు కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వేసిన చలోక్తులు నిజం చేస్తూ రెండు అడుగులు వెనక్కు వేసినంత మాత్రాన విజేత పోటీలో ఓడిపోవడం కాదని 20 అడుగులు ముందుకు వెళ్లడానికి ప్రయత్నమని ఈ ఘటనతో ఎంపీ బాలశౌరి నిరూపించారు. మంచివారి మౌనం వెనుక అనేక రాజనీతి ఆలోచనలు ఉంటాయని ఎంపీ బాలసౌరి మరోసారి నిరూపించారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







