వ్యాక్సిన్ పొందిన వాళ్లకే పబ్లిక్ ప్రాంతాల్లోకి అనుమతి
- June 25, 2021
కువైట్: రోజు రోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పబ్లిక్ ప్లేసులలో ప్రజా సంచారంపై ఆంక్షలు విధిస్తోంది కువైట్ ప్రభుత్వం. కేవలం వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే పబ్లిక్ ప్రాంతాల్లో అనుమతి ఉంటుందని ప్రకటించింది. జూన్ 27 ఆదివారం నుంచే ఈ నిబంధన అమలులోకి రానుంది. వ్యాక్సిన్ పొందిన వారే పబ్లిక్ ప్రాంతాల్లోకి అనుమతించేలా కువైట్ ప్రభుత్వం ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దింపనుంది. 6000 స్క్వైర్ మీటర్ల కంటే ఎక్కువగా ఉండే మాల్స్ తో పాటు రెస్టారెంట్లు, కేఫ్ లు, జిమ్ములు, షాప్స్ దగ్గర ఈ బృందాలు తమ విధులు నిర్వహించనున్నాయి. కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ప్రూఫ్ చూపిస్తేనే లోనికి వెళ్లేందుకు అనుమతిస్తారు. ఇటీవలి కాలంలో కువైట్ లో వైరస్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువమంది డెల్టా వేరియంట్ బారిన పడుతుండటంతో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు పబ్లిక్ ప్లేసులలో ఎంట్రీకి వ్యాక్సిన్ తో లింక్ పెట్టింది ఆరోగ్య శాఖ.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









