థర్డ్ వేవ్ను అరికట్టడమే ఈ కంట్రోల్ రూమ్ లక్ష్యం - కేటీఆర్
- June 25, 2021
హైదరాబాద్: నగరంలోని వెంగళ్రావు నగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎస్ సోమేశ్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్తో పాటు పలువురు పాల్గొన్నారు.

ఈ సెంటర్ ప్రారంభోత్సవం కంటే ముందు కేటీఆర్ ట్వీట్ చేశారు. శాంతి కోసం ఎంత శ్రమిస్తే.. యుద్ధంలో అంత తక్కువ రక్తాన్ని చిందిస్తాము అని కేటీఆర్ తన ట్వీట్లో అభిప్రాయపడ్డారు. ఈ కొవిడ్ కంట్రోల్ రూమ్ను అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా కరోనా థర్డ్ వేవ్ను, కరోనా ఇతర సమస్యలను పూర్తిగా అరికట్టే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









