రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్కు అపూర్వ స్వాగతం
- March 08, 2016
బేగంపేట ఎయిర్పోర్టు గులాబీమయమైంది. సీఎం కేసీఆర్కు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. బేగంపేట నుంచి మొదలుకొని క్యాంపు ఆఫీస్ దాకా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇక వందలాది మంది కళాకారులు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్కు అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. తమ దేవుడు కేసీఆరే అని రైతులు నినదిస్తున్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న కేసీఆర్కు పాదాభివందనం చేస్తున్నామని తెలిపారు. ఇన్నేళ్లు నెరవేరని కల ఈనాడు నెరవేరడం సీఎం కేసీఆర్తో సాధ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణ - మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతరాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి చారిత్రక ఒప్పందం కుదిరిన విషయం విదితమే.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







