రైతులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్‌కు అపూర్వ స్వాగతం

- March 08, 2016 , by Maagulf
రైతులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్‌కు అపూర్వ స్వాగతం

బేగంపేట ఎయిర్‌పోర్టు గులాబీమయమైంది. సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. బేగంపేట నుంచి మొదలుకొని క్యాంపు ఆఫీస్ దాకా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇక వందలాది మంది కళాకారులు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. రైతులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్‌కు అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. తమ దేవుడు కేసీఆరే అని రైతులు నినదిస్తున్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నామని తెలిపారు. ఇన్నేళ్లు నెరవేరని కల ఈనాడు నెరవేరడం సీఎం కేసీఆర్‌తో సాధ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణ - మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతరాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి చారిత్రక ఒప్పందం కుదిరిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com