భారత ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం

- June 26, 2021 , by Maagulf
భారత ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం

విశాఖపట్నం: నగరంలో పర్యటనకు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు కు  విశాఖ విమానాశ్రయంలో శనివారం  ఘనంగా స్వాగతం పలికారు.ఆయన ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో ఉదయం గం. 11:45 ని.లకు విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనకు ప్రజా ప్రతినిధులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.ఉపరాష్ట్రపతికి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు,నౌకాదళ అధికారి వైస్ అడ్మిరల్ ఏ.బి. సింగ్, విశాఖ మేయరు జి.వి.హరి కుమారి, విశాఖ పోర్టు చైర్మన్ కె.రామ్మోహన్ రావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, ఎమ్ఎల్సీ  పి.వి.మాధవ్,తదితరులు స్వాగతం పలికారు.తరువాత  ఆయన నేరుగా  విశాఖ పోర్ట్ ట్రస్ట్ గెస్ట్ హౌస్ కి వెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com