నేడు పీవీ నరసింహారావు జయంతి..ఉపరాష్ట్రపతి,ప్రధాని నివాళులు
- June 28, 2021
న్యూఢిల్లీ: పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు,ప్రధాని మోదీ నివాళులర్పించారు.ఈ సందర్భంగా వెంకయ్యానాయుడు మాట్లాడుతూ పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడని, ఆర్థిక సంస్కరణ మార్గదర్శి అని అన్నారు. బముముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులర్పిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. స్వావలంబన, స్వయం సమృద్ధికి పీవీ పెద్ద పీట వేశారని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.దేశ భవిష్యత్తుకు పీవీ బాటలు వేశారన్నారు.మాతృభాషకు పీవీ చాలా ప్రాధాన్యతమిచ్చారని చెప్పారు. పీవీ సేవలను జాతి చిరకాలం గుర్తు పెట్టుకుంటుందని వెంకయ్య స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశాభివృద్ధికి పీవీ చేసిన కృషిని దేశం గుర్తుచేసుకుందని తెలిపారు.పీవీ గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నారు.
కాగా, పీవీ నరసింహారావు జూన్ 28, 1921లో వరంగల్ జిల్లాలో జన్మించారు.మంథని నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా మొత్తం వివిధ స్థానాల్లో పోటీ చేసి 6 సార్లు ఎంపీగా గెలిచారు.1996లో నంద్యాల నుంచి ఎంపీగా గెలిచారు.తెలుగు వ్యక్తి ప్రధాని అవుతున్నాడని ఎన్టీఆర్ వీపీకి పోటీగా అభ్యర్థిని నిలబెట్టకపోవడం విశేషం.రాజీవ్ గాంధీ హయాలో 9వ ప్రధాన మంత్రిగా పని చేశారు. దేశంలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలే ఇప్పటికీ దేశంలో కొనసాగుతూనే ఉన్నాయి.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









