హైదరాబాద్: లింకు రోడ్లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- June 28, 2021
హైదరాబాద్: హైదరాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు 5 లింకు రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగర అభివృద్ధికి రహదారులు చాలా ముఖ్యమని తెలిపారు. హైదరాబాద్లో ఇప్పటికే 16 లింకు రోడ్లను పూర్తి చేశామని, వీటితో హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే మరో 6 రోడ్లను పూర్తి చేస్తామని అన్నారు. హైదరాబాద్ పెరుగుతున్న జనాభా, జన సాంద్రతను దృష్టిలో ఉంచుకుని రహదారులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎస్ఆర్డీపీలో భాగంగా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తున్నామని చెప్పారు. రూ. 6 వేల కోట్లతో ఎస్ఆర్డీపీ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

అంతేగాక, హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద అదనంగా మొదటి దశలో రూ. 313.65 కోట్లతో 22 లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. దశలవారీగా మొత్తం 133 లింకు రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. మౌలిక వసతుల విస్తరణలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్, జోనల్ కమిషనర్ రవికిరణ్, కార్పొరేటర్ జగదీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
- వరల్డ్ హ్యాపినెస్ రిపోర్టు.. 22వ స్థానంలో సౌదీ అరేబియా..!!









