ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- March 25, 2026
మస్కట్: కొనసాగుతున్న అల్పపీడన వాతావరణ వ్యవస్థ వల్ల ప్రభావితమైన పలు గవర్నరేట్లలో 93 మందికి ఆశ్రయం కల్పించినట్లు జాతీయ అత్యవసర నిర్వహణ కమిటీలోని రిలీఫ్ మరియు షెల్టర్ విభాగం వెల్లడించింది.
ముసందమ్ గవర్నరేట్లోని ఖసాబ్లో ఒక ఆశ్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో ఖాదా గ్రామానికి చెందిన 23 మందికి వసతి కల్పించారు.
దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో బర్కాకు చెందిన ఐదుగురు సభ్యుల కుటుంబానికి చెందిన ఇల్లు దెబ్బతినడంతో వారిని ఒక హోటల్కు తరలించారు.
ఇదిలా ఉండగా, మస్కట్ గవర్నరేట్లో ఇల్లు దెబ్బతినడంతో మరో నలుగురు సభ్యుల కుటుంబాన్ని సమీపంలోని హోటల్కు తరలించారు.
అల్ దఖిలియా గవర్నరేట్లోని ఆడమ్ విలాయత్లో ఉన్న షెల్టర్ ముందుజాగ్రత్త చర్యగా ప్రస్తుతం 61 మందికి ఆశ్రయం కల్పించింది.
పరిణామాలకు ప్రతిస్పందించడానికి తాము నిరంతరం సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్పాగా, ప్రజా భద్రతను నిర్ధారించడానికి సంబంధిత సంస్థలతో సమన్వయం కొనసాగుతోందని అథారిటీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
- వరల్డ్ హ్యాపినెస్ రిపోర్టు.. 22వ స్థానంలో సౌదీ అరేబియా..!!









