ఏపీలో కరోనా కేసుల వివరాలు
- June 29, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి.రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో నిన్న ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 91,231 సాంపిల్స్ పరీక్షించగా.. 3,620 మంది పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 41 మంది కోవిడ్తో మృతి చెందారు.. చిత్తూరు జిల్లాలో ఏడుగురు, కృష్ణా జిల్లాలో ఆరుగురు, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాలో ఐదుగురు చొప్పున, గూంటురు, పశ్చిమ గోదావరిలో నలుగురు చొప్పున, శ్రీకాకుళంలో ముగ్గురు, అనంతపూర్, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున, కర్నూల్, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఇదే సమయంలో 5,757 మంది కరోనా బాధితులు సంపూర్ణంగా కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది. ఇక, నేటి వరకు 2,18,95,922 సాంపిల్స్ ని పరీక్షించినట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,85,716కు చేరుకోగా… రికవరీ కేసులు 18,32,971కు పెరిగాయి.ఇప్పటి వరకు కోవిడ్తో 12,671 మంది మృతిచెందారు.ప్రస్తుతం రాష్ట్రంలో 40,074 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







