బహ్రెయిన్: భారత రాయబారికి స్వాగతం పలికిన LMRA చీఫ్ ఎగ్జిక్యూటీవ్
- June 30, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ భారత రాయబారిగా కొత్త నియామకమైన పియూష్ శ్రీవస్తవకి లేబర్ మార్కెట్ రెగ్యూలేటరీ అథారిటీ-LMRA చీఫ్ ఎగ్జిక్యూటీవ్ జమాల్ అబ్దుల్లాజీజ్ అల్ అలావి సాదర స్వాగతం పలికారు. బహ్రెయిన్ కు భారత రాయబారిగా నియామకం అయినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్-బహ్రెయిన్ మధ్య దౌత్య సంబంధాల వ్యవహారాలను ఆయన విజయవంతంగా నిర్వహించాలని అభిలాషించారు. భారత ఎంబసీ కార్యాలయం..బహ్రెయిన్ ప్రభుత్వ సంస్థలతో కలిసి ప్రవాసీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే బహ్రెయిన్ అభివృద్ధిలో భారత కార్మిక శక్తి కృషిని ఎంతో ఉందని ఇండియన్ అంబాసిడర్ పియూష్ శ్రీవస్తవకు వివరించారు. అలాగే బహ్రెయిన్ లోని ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. అటు భారత రాయబారి పియూష్ శ్రీవస్తవ కార్మికుల సంక్షేమానికి బహ్రెయిన్ చేపడుతున్న చర్యలను ప్రశంసించారు. ముఖ్యంగా భారతీయు కార్మికుల పట్ల చూపుతున్న చొరవను కొనియాడారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







