బహ్రెయిన్: భారత రాయబారికి స్వాగతం పలికిన LMRA చీఫ్ ఎగ్జిక్యూటీవ్
- June 30, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ భారత రాయబారిగా కొత్త నియామకమైన పియూష్ శ్రీవస్తవకి లేబర్ మార్కెట్ రెగ్యూలేటరీ అథారిటీ-LMRA చీఫ్ ఎగ్జిక్యూటీవ్ జమాల్ అబ్దుల్లాజీజ్ అల్ అలావి సాదర స్వాగతం పలికారు. బహ్రెయిన్ కు భారత రాయబారిగా నియామకం అయినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్-బహ్రెయిన్ మధ్య దౌత్య సంబంధాల వ్యవహారాలను ఆయన విజయవంతంగా నిర్వహించాలని అభిలాషించారు. భారత ఎంబసీ కార్యాలయం..బహ్రెయిన్ ప్రభుత్వ సంస్థలతో కలిసి ప్రవాసీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే బహ్రెయిన్ అభివృద్ధిలో భారత కార్మిక శక్తి కృషిని ఎంతో ఉందని ఇండియన్ అంబాసిడర్ పియూష్ శ్రీవస్తవకు వివరించారు. అలాగే బహ్రెయిన్ లోని ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. అటు భారత రాయబారి పియూష్ శ్రీవస్తవ కార్మికుల సంక్షేమానికి బహ్రెయిన్ చేపడుతున్న చర్యలను ప్రశంసించారు. ముఖ్యంగా భారతీయు కార్మికుల పట్ల చూపుతున్న చొరవను కొనియాడారు.
తాజా వార్తలు
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!









