ఆరేంజ్ బాక్సుల్లో కాప్టగన్ పిల్స్..పట్టుకున్న అధికారులు
- July 01, 2021
సౌదీ: జెడ్డా నౌకాశ్రాయం ద్వారా పెద్ద మొత్తంలో నిషేధిత కాప్టగన్ పిల్స్ స్మగ్లింగ్ చేసే ప్రయత్నానికి చెక్ పెట్టారు అధికారులు. ఆరేంజ్ బాక్సుల్లో అడుగున పిల్స్ పెట్టి అధికారుల కళ్లు గప్పేందుకు ప్రయత్నించారు స్మగ్లర్లు.అయితే..బాక్సులను స్కాన్ చేసిన తర్వాత అనుమానం వచ్చి పూర్తిగా చెక్ చేయటంతో కాప్టగన్ పిల్స్ బాగోతం బయటపడింది. 4.5 మిలియన్ల పిల్స్ ను అధికారులు గుర్తించారు. అయితే..ఇవి ఎక్కడి నుంచి రవాణా అవుతున్నాయనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఇదిలాఉంటే గత శనివారమే లెబనాన్ నుంచి 14.4 మిలియన్ల యాంఫేటమిన్ పిల్స్ ను అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబడిన విషయం తెలిసిందే. ఇక గత ఏప్రిల్ లో దానిమ్మ పండ్ల బాక్సుల్లో 5.3 మిలియన్ల పిల్స్ స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులు వాటిని పట్టుకున్నారు.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









