ఆరేంజ్ బాక్సుల్లో కాప్టగన్ పిల్స్..పట్టుకున్న అధికారులు
- July 01, 2021
సౌదీ: జెడ్డా నౌకాశ్రాయం ద్వారా పెద్ద మొత్తంలో నిషేధిత కాప్టగన్ పిల్స్ స్మగ్లింగ్ చేసే ప్రయత్నానికి చెక్ పెట్టారు అధికారులు. ఆరేంజ్ బాక్సుల్లో అడుగున పిల్స్ పెట్టి అధికారుల కళ్లు గప్పేందుకు ప్రయత్నించారు స్మగ్లర్లు.అయితే..బాక్సులను స్కాన్ చేసిన తర్వాత అనుమానం వచ్చి పూర్తిగా చెక్ చేయటంతో కాప్టగన్ పిల్స్ బాగోతం బయటపడింది. 4.5 మిలియన్ల పిల్స్ ను అధికారులు గుర్తించారు. అయితే..ఇవి ఎక్కడి నుంచి రవాణా అవుతున్నాయనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఇదిలాఉంటే గత శనివారమే లెబనాన్ నుంచి 14.4 మిలియన్ల యాంఫేటమిన్ పిల్స్ ను అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబడిన విషయం తెలిసిందే. ఇక గత ఏప్రిల్ లో దానిమ్మ పండ్ల బాక్సుల్లో 5.3 మిలియన్ల పిల్స్ స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులు వాటిని పట్టుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







