సమ్మర్ సెలవుల్లో విదేశాలకు వెళ్లే వారికి కొత్త సూచనలు
- July 01, 2021
దుబాయ్: సమ్మర్ సెలవుల్లో విదేశీ ప్రయాణాలకు సిద్ధం అవుతున్నారా? అయితే..ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించాలంటూ దుబాయ్ సుప్రీం కమిటీ పౌరులు, ప్రజలకు సూచించింది. సెకండ్ డోసు వేసుకున్న 14 రోజుల తర్వాతే విదేశీ ప్రయాణాలు చేయటం మంచిదని అభిప్రాయపడింది. రెండో డోసు వేసుకున్న 14 రోజుల తర్వాతే శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తి స్థాయిలో పెరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది. వీలైనంత వరకు విదేశాలకు వెళ్లకపోవటమే మంచిదని అభిప్రాయపడుతూనే ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాత్రం కోవిడ్ ప్రోటోకాల్ తప్పకుండా పాటించాలని సూచించింది. ముఖ్యంగా కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలను విస్మరించాలని కోరింది. అలాగే ఆయా దేశాల్లో అమలులో ఉన్న కోవిడ్ నిబంధనలను ముందే తెలుసుకొని అందుకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. పబ్లిక్ ప్రాంతాలు, సందర్శన ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు భౌతిక దూరం పాటించటంతో పాటు ఫేస్ మాస్క్ విధిగా ధరించాలని సుప్రీం కమిటీ సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







