భారత్, పాకిస్తాన్ తో సహా 14 దేశాలపై ట్రావెల్ బ్యాన్
- July 02, 2021యూఏఈ: భారత్, పాకిస్తాన్ తో పాటు కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండే దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్లు యూఏఈ స్పష్టం చేసింది. ట్రావెల్ బ్యాన్ లిస్టులో ఉన్న దేశాలకు తమ పౌరులకు ప్రయాణించొద్దని, ఆయా దేశాల నుంచి ఎవరిని అనుమతించబోమని వెల్లడించింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియత్నాం, నమీబియా, జాంబియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సియెర్రా లియోన్, లైబీరియా, దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాలకు వెళ్లడాన్ని నిషేధించినట్లు విదేశీ వ్యవహారాల మరియు అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ (మోఫాయిక్), జాతీయ అత్యవసర సంక్షోభ, విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్సిఇఎంఎ) ప్రకటించాయి. అయితే..దౌత్య వ్యవహారలకు సంబంధించి ప్రయాణాలకు మినహాయింపు ఉంటుంది. అలాగే అత్యవసర చికిత్స, ప్రభుత్వ అధికారులు, బిజినెస్, టెక్నికల్ డెలిగేట్స్ కు కూడా మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ