వ్యాక్సిన్ తీసుకున్న పౌరులకు ల్యాండ్, సీ బోర్డర్స్ ఓపెన్
- July 02, 2021కువైట్: వ్యాక్సిన్ తీసుకున్న తమ పౌరులు దేశ సరిహద్దులు దాటి వెళ్లేందుకు, వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు కువైట్ ప్రకటించింది.ఇవాళ్టి నుంచి ప్రతి రోజు 12 గంటల పాటు భూ, సముద్ర సరిహద్దులు తెరిచి ఉంటాయని స్పష్టం చేసింది.మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు ల్యాండ్, సీ బోర్డర్స్ ద్వారా ప్రయాణం చేయవచ్చని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న పౌరులు,వారి కుటుంబ సభ్యులు, డొమస్టిక్ వర్కర్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణం చేయవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది.అయితే..దేశ పౌరులు వారి రక్త సంబంధీకులు, డొమస్టిక్ వర్కర్లు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అయినా తీసుకొని ఉండాలి.ఇదిలా ఉంటే ఆగస్ట్ 1 నుంచి వ్యాక్సిన్ పొందిన ప్రవాసీయులకు కూడా దేశంలోకి అనుమతించనున్నట్లు కువైట్ ఇప్పటికే ప్రకటించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ