వ్యాక్సిన్ తీసుకున్న పౌరులకు ల్యాండ్, సీ బోర్డర్స్ ఓపెన్

- July 02, 2021 , by Maagulf
వ్యాక్సిన్ తీసుకున్న పౌరులకు ల్యాండ్, సీ బోర్డర్స్ ఓపెన్

కువైట్: వ్యాక్సిన్ తీసుకున్న తమ పౌరులు దేశ సరిహద్దులు దాటి వెళ్లేందుకు, వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు కువైట్ ప్రకటించింది.ఇవాళ్టి నుంచి ప్రతి రోజు 12 గంటల పాటు భూ, సముద్ర సరిహద్దులు తెరిచి ఉంటాయని స్పష్టం చేసింది.మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు ల్యాండ్, సీ బోర్డర్స్  ద్వారా ప్రయాణం చేయవచ్చని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న పౌరులు,వారి కుటుంబ సభ్యులు, డొమస్టిక్ వర్కర్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణం చేయవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది.అయితే..దేశ పౌరులు వారి రక్త సంబంధీకులు, డొమస్టిక్ వర్కర్లు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అయినా తీసుకొని ఉండాలి.ఇదిలా ఉంటే ఆగస్ట్ 1 నుంచి వ్యాక్సిన్ పొందిన ప్రవాసీయులకు కూడా దేశంలోకి అనుమతించనున్నట్లు కువైట్ ఇప్పటికే ప్రకటించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com