వ్యాక్సిన్ తీసుకున్న పౌరులకు ల్యాండ్, సీ బోర్డర్స్ ఓపెన్
- July 02, 2021
కువైట్: వ్యాక్సిన్ తీసుకున్న తమ పౌరులు దేశ సరిహద్దులు దాటి వెళ్లేందుకు, వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు కువైట్ ప్రకటించింది.ఇవాళ్టి నుంచి ప్రతి రోజు 12 గంటల పాటు భూ, సముద్ర సరిహద్దులు తెరిచి ఉంటాయని స్పష్టం చేసింది.మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు ల్యాండ్, సీ బోర్డర్స్ ద్వారా ప్రయాణం చేయవచ్చని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న పౌరులు,వారి కుటుంబ సభ్యులు, డొమస్టిక్ వర్కర్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణం చేయవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది.అయితే..దేశ పౌరులు వారి రక్త సంబంధీకులు, డొమస్టిక్ వర్కర్లు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అయినా తీసుకొని ఉండాలి.ఇదిలా ఉంటే ఆగస్ట్ 1 నుంచి వ్యాక్సిన్ పొందిన ప్రవాసీయులకు కూడా దేశంలోకి అనుమతించనున్నట్లు కువైట్ ఇప్పటికే ప్రకటించింది.
తాజా వార్తలు
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ







