భారత్ కరోనా అప్డేట్

- July 02, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్ లో క‌రోనా కేసులు పెరుగుతూ తగ్గుతున్నాయి.నిన్న పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ కాస్త తగ్గాయి.కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది.ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్లో 46,617 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో భారత్లో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,04,58,251 కి చేరింది.ఇందులో 2,95,48,302 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 5,09,637 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో క‌రోనాతో 853 మంది మృతి చెందారు.దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,00,312 మంది క‌రోనాతో మృతి చెందారు.ఒక్క రోజులో దేశంలో 59,384 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com