NPCIL లో ఉద్యోగాలు..
- July 02, 2021
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా (NPCIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ కర్ణాటకలోని కైగా సైట్లో ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోనున్నారు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 9 నుంచి ప్రారంభమవుతోన్న వేళ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 26 ఫిక్స్డ్ టర్మ్ ఇంజినీర్ పోస్టులను భర్తీచేయనున్నారు.
* 26 ఖాళీల్లో భాగంగా సివిల్ (11), మెకానికల్ (08), ఎలక్ట్రికల్ (04), సీ అండ్ ఐ-ఈసీ (02), సీ అండ్ ఐ సీఎస్/ఐఎస్ (01) ఖాళీలను రిక్రూట్ చేస్తారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్/బీఎస్సీ) డిగ్రీని 60 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 29-07-2021 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికై అభ్యర్థులకు నెలకు రూ. 61,400 జీతంగా అందిస్తారు.
* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 09-07-2021న ప్రారంభమవుతుండగా 29-07-2021తో ముగియనుంది.
పూర్తి వివరాల కోసం ఈ లింకు https://npcilcareers.co.in/ క్లిక్ చెయ్యండి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







