షాపులపై పాక్షిక ఆంక్షల్లో అర్ధం లేదన్న కువైట్ ఎంపీ
- July 04, 2021
కువైట్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు కువైట్ కేబినెట్ అమలు చేస్తున్న నిర్ణయాలపై ఎంపీ అబ్దుల్ కరీం అల్ కందారీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ వైపు వ్యాక్సిన్ తీసుకున్నవారికి మాత్రమే షాపింగ్ కాంప్లెక్స్ లోకి అనుమతి అంటూ ఆంక్షలు విధిస్తూ మరోవైపు రాత్రి 8 గంటల నుంచి షాపులను, మాల్స్ ను మూసివేయాలన్న ఆదేశాల్లో అర్ధం లేదని అభిప్రాయపడ్డారు. కాంప్లెక్స్ లోకి వ్యాక్సిన్ తీసుకున్నవారిని మాత్రమే అనుమతిస్తే..ఇక షాపులను మూసివేయాల్సిన అవసరం ఏంటన్నది ఆయన లాజిక్. అంతేకాదు వ్యాక్సిన్ పొందిన వారి వివరాల్లోనూ గందరగోళం ఉందన్నారాయన. వ్యాక్సిన్ పొంది వైరస్ నుంచి రక్షణ ఉందని భావిస్తున్నవారిని మాత్రమే కాంప్లెక్స్ లోకి అనుమతించాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లైతే రాత్రివేళల్లో కాంప్లెక్స్ లను మూసివేయాలన్న పాక్షిక అంక్షలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







