అబుదాబీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
- March 09, 2016
అబుదాబీ నివాసితులు భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా వాహనదారులు అత్యంత జాగ్రత్తగా రోడ్లపై ప్రయాణించాల్సిందిగా అధికారులు హెచ్చరించారు. అత్యధికంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అలాగే 110 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అబుదాబీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, భారీ వర్షాలు ఈదుగారులలతో ఆస్తి నష్టం కలగజేస్తున్నాయని పేర్కొంది. రహదార్లపై విరిగిపడిన చెట్లతో డ్రైవింగ్ కండిషన్స్ ఇబ్బందిగా మారినట్లు మినిస్ట్రీ వెల్లడించింది. సోషల్ మీడియా ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు పరిస్థితికి సంబంధించిన ఫొటోలు ఉంచుతున్నారు. వాటి ఆధారంగా రోడ్లపైకి వచ్చేవారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎయిర్పోర్ట్లో ఓ చోట ఈదురుగాలులకు పైకప్పు కూలిపోయినట్లుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో పట్ల ఖండన ప్రకటన చేసింది అబుదాబీ ఎయిర్పోర్ట్స్ సంస్థ. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని యూఏఈ అధికారిక వర్గాలు వెల్లడించాయి. విమాన సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు తొలుత ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత యధాతథంగా విమానాలు నడుస్తాయని ఇంకో ప్రకటన విడుదల చేశారు. అలాగే అబుదాబీ ఎడ్యుకేషన్ కౌన్సిల్, బుధవారం స్కూళ్ళను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. రేపు కూడా స్కూళ్ళు తెరవరు. యూఏఈ మాత్రమే కాకుండా గల్ఫ్ దేశాల్లో చాలావరకు ఇదే వాతావరణ పరిస్థితి నెలకొంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







