కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం..!

- July 07, 2021 , by Maagulf
కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం..!

న్యూ ఢిల్లీ: కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి హిందీలో ప్రమాణం చేసారు. కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 43 మంది కొత్త మంత్రులతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. అంతకుముందు కేంద్ర సహాయమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి పదోన్నతి కల్పించారు ప్రధాని మోదీ. కొవిడ్ నిబంధనల మధ్య రాష్ట్రపతి భవన్‌ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com