జ్యుడీషియల్ అథారిటీని అవమానించిన కేసులో వ్యక్తిపై తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం
- July 08, 2021
బహ్రెయిన్: లోవర్ క్రిమినల్ కోర్టు, జ్యుడీషియల్ అథారిటీని అవమానించిన కేసులో నిందితుడిపై తీర్పు వెల్లడించనుంది. సోషల్ మీడియా వేదికగా నిందితుడు, జ్యుడీషియల్ అథారిటీని అవమానిస్తూ పోస్టింగ్స్ పెట్టినట్లు అభియోగాలున్నాయి. జ్యుడీషియల్ అథారిటీ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ కేసు విచారణ చేపట్టడం జరిగింది. నిందితుడికి సమన్లు జారీ చేసి, విచారించారు. నిందితుడు, ఆ వీడియో చేసిన విషయాన్ని అంగీకరించినా, జ్యుడీషియల్ అథారిటీస్ మీద విమర్శలు చేయాలన్నది తన ఉద్దేశ్యం కాదని వాదించాడు. పత్రికల్లో కేసుల వివరాలు ప్రచురించడం గురించి తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని ఆయన అంటున్నాడు. అవగాహన కల్పించేందుకు ఆ వీడియో చేశానని అన్నాడు. అథారిటీ మీద జుగుప్సాకరమైన ఆరోపణలు, వ్యాఖ్యలు నిందితుడు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







