'ఆసరా' సేవల్ని అభినందించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్
- July 08, 2021
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో వినియోగదారుల హక్కుల పరిరక్షణపై 'ఆసరా సంస్థ అందిస్తున్న సేవలను డీజీపీ గౌతం సవాంగ్ కొనియాడారు. అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్ నెస్ (ఆసరా) సంస్థ కార్యాచరణ బుక్ లెట్ ని గురువారం డీజీపీ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆసరా సేవలను జాతీయ స్థాయిలో ఇప్పటికే విస్తరించామని, త్వరలో లీగల్ అవేర్ నెస్ మొబైల్ వ్యానులను కూడా ప్రారంభిస్తున్నట్లు ఆసరా కృష్ణా జిల్లా అధ్యక్షుడు, అమరావతి బోటింగ్ క్లబ్ సి.ఇ.ఓ. తరుణ్ కాకాని డీజీపీకి తెలిపారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం న్యాయపరంగా తాము చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన కల్పించడంతోపాటు,
వారి నుంచి వచ్చే ఫిర్యాదులను సంబంధిత ఫోరమ్ లో దాఖలు చేయడం కూడా ఆసరా పని అని తరుణ్ కాకాని పేర్కొన్నారు. వివిధ జిల్లాలలో సహాయం కోరే వినియోగదారులను గుర్తించి వారిక ఆసరా కల్పిస్తామన్నారు. తమ సంస్థ చేపట్టే అవగాహన కార్యక్రమాలకు డీజీపీ తమ వంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని, త్వరలో డీజీపీ చేతుల మీదుగా లీగల్ అవేర్ నెస్ మొబైల్ వ్యాన్లను ప్రారంభించనున్నామని తరుణ్ కాకాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేజిస్ట్రేట్ మాధవరావు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మధు కోనేరు, కృష్ణా ఇసి ప్రకాశ్, ఆసరా మహిళా అధ్యక్షురాలు శిరీషా చేకూరి, కరంకౌర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







