వ్యాక్సిన్ వేయించుకోకుంటే ఉద్యోగం గోవిందా
- July 09, 2021ఫిజి: కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి అంటే ఎకైక మార్గం వ్యాక్సిన్ ఒక్కటే.వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని అన్ని దేశాలు తమకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ను దిగుమతి చేసుకొని ప్రజలకు అందిస్తున్నాయి.అయితే, మొదటి వేవ్ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న దేశాలు, డెల్టావేరియంట్ కారణంగా సెకండ్ వేవ్ ను ఎదుర్కొంటున్నాయి.సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంటుండటంతో దేశాలు లాక్డౌన్ను, వ్యాక్సిన్ను అందిస్తున్నాయి.ఏప్రిల్ వరకు ఫిజీ దేశంలో కంట్రోల్ ఉన్న కరోనా,డెల్టావేరియంట్ కారణంగా కేసులు పెరగడం మొదలుపెట్టాయి.
దీంతో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారిపోయాయి.కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయింది.ఆగస్టు 15 నాటికి దేశంలోని ప్రభుత్వం ఉద్యోగులంతా మొదటిడోసు వ్యాక్సిన్ తీసుకోవాలని, లేదంటే ఉద్యోగులు సెలవులపై వెళ్లాల్సి వస్తుందని, నవంబర్ 1వ తేదీ వరకు సెకండో డోస్ తీసుకోకుంటే ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుందని ఫిజీ ప్రభుత్వం హెచ్చరించింది.ఇక ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఆగస్టు 1 వరకు మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకోకుంటే భారీ జరిమానాలు విధిస్తామని ఫిజీ ప్రభుత్వం హెచ్చరించింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..