వ్యాక్సిన్ వేయించుకోకుంటే ఉద్యోగం గోవిందా
- July 09, 2021
ఫిజి: కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి అంటే ఎకైక మార్గం వ్యాక్సిన్ ఒక్కటే.వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని అన్ని దేశాలు తమకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ను దిగుమతి చేసుకొని ప్రజలకు అందిస్తున్నాయి.అయితే, మొదటి వేవ్ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న దేశాలు, డెల్టావేరియంట్ కారణంగా సెకండ్ వేవ్ ను ఎదుర్కొంటున్నాయి.సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంటుండటంతో దేశాలు లాక్డౌన్ను, వ్యాక్సిన్ను అందిస్తున్నాయి.ఏప్రిల్ వరకు ఫిజీ దేశంలో కంట్రోల్ ఉన్న కరోనా,డెల్టావేరియంట్ కారణంగా కేసులు పెరగడం మొదలుపెట్టాయి.
దీంతో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారిపోయాయి.కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయింది.ఆగస్టు 15 నాటికి దేశంలోని ప్రభుత్వం ఉద్యోగులంతా మొదటిడోసు వ్యాక్సిన్ తీసుకోవాలని, లేదంటే ఉద్యోగులు సెలవులపై వెళ్లాల్సి వస్తుందని, నవంబర్ 1వ తేదీ వరకు సెకండో డోస్ తీసుకోకుంటే ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుందని ఫిజీ ప్రభుత్వం హెచ్చరించింది.ఇక ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఆగస్టు 1 వరకు మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకోకుంటే భారీ జరిమానాలు విధిస్తామని ఫిజీ ప్రభుత్వం హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







