కువైట్ లో దారుణ హత్య కు గురైన భారతీయుడు
- July 11, 2021కువైట్: కువైట్ లోని అబూ ఫాతిరా ప్రాంతంలో దారుణ హత్య చోటుచేసుకుంది. హోమ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న భారతీయునిపై దాడి చేసి చంపిన సంఘటన కలకలం రేపింది.
హోమ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న 41 ఏళ్ల భారతీయ వ్యక్తి కువైట్ పౌరుడి ఇంట్లో చనిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హతుని శరీరం రక్తపు కొలనులో పడి ఉండటం గమనించారు. హతుని తలకు బలమైన గాయం అయినట్టు తెలుస్తోంది. స్తలంలో హింస తాలూకు సంఘటనలు జరిగినట్టు పోలీసులు కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కు అప్పగించడం జరిగింది.
డెలివరీ ఆర్డర్ కు డబ్బు చెల్లించే వరకు ఇంటిని వదిలి వెళ్ళడానికి నిరాకరించిన భారతీయ కార్మికుడిపై కోపంతో ఆ ఇంటి యజమాని కొడుకు ఈ దాడి చేసి పారిపోయాడని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయం. పారిపోయిన నిందితుడి అరెస్టు మరియు దర్యాప్తు కొరకు అతని డేటాను అన్ని భద్రతా కేంద్రాలకు పంపటం జరిగింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం