భారత్ లో కరోనా కేసుల వివరాలు
- July 12, 2021న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో భారత్ లో 37,154 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,74,376 కి చేరింది.ఇందులో 3,00,14,713 మంది కోలుకొని డిశ్చార్జ్కాగా, 4,50,899 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.ఇక, గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 724 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,08,764 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 39,649 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 37,73,52,501 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం