వ్యాక్సినేషన్ సెంటర్కి కాలినడకన, బైక్ మీద వచ్చే వారికి నో ఎంట్రీ
- July 12, 2021ఖతార్: పారిశ్రామిక రంగం, వ్యాపార రంగాల్లోని సిబ్బందికి వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించినట్లు ఖతార్ వెల్లడించింది. ఇవాళ్టి (జులై 12) నుంచి వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభం అవుతోంది. ప్రపంచంలోని అతి పెద్ద వ్యాక్సినేషన్ సెంటర్లలో ఇదీ కూడా ఒక్కటి. ప్రతిరోజు 25 వేల మందికి వ్యాక్సిన్ అందించవచ్చు. అయితే..ఈ వ్యాక్సిన్ సెంటర్ కు వచ్చే వారు కాలినడకన, బైక్ ల మీద రావొద్దని వ్యాక్సినేషన్ సెంటర్ నిర్వాహకులు సూచించారు. కాలినడకన, బైక్ ల మీద వచ్చే వారికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. వీకెండ్లో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కంపెనీలు తమ సిబ్బందికి వ్యాక్సిన్ షెడ్యూల్ ఖారారు చేసేందుకు [email protected] కు మెయిల్ చేయాలని కోరారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్