హైదరాబాద్లో మరో ఐటీ హబ్..
- July 15, 2021
హైదరాబాద్: హైదరాబాద్లో ఐటీ హబ్లు రాజధాని నలుమూలలా విస్తరిస్తున్నాయి.. రానున్న కాలంలో మరో ఐటీ హబ్ రూపాంతరం చెందనుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్న కొల్లూరు, ఇదుళ్లనాగులపల్లి ప్రాంతాలు ఇందుకు అనువుగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలో ఉన్న ఈ పరిసర గ్రామాల్లో ఐటీ హబ్కు అనుకూలంగా ఉందని తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్డుకు 1.3 కిలోమీటర్ల దూరంలో ఉన్న 640 ఎకరాల భూమిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ గుర్తించింది. హైటెక్ సిటీ తరహాలో ఈ హబ్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం హెచ్ఎండీఏ రూపొందించిన ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఇందుకోసం సమీకరించే భూములకుగాను భూ యజమానులకు ఎకరాకు 600 గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థల ద్వారా దాదాపు పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయని ప్రాథమిక అంచనాగా హెచ్ఎండీఏ నివేదికలో పేర్కొంది. ఐటీ అనుబంధ సేవా రంగాలు కూడా అక్కడ భారీగా విస్తరించే అవకాశం ఉందని భావిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







